31. ‘తెలుగుజాతి తొలి విజ్ఞాన సర్వస్వం’గా ప్రసిద్ది పొందిన పాల్కురికి సోమనాథుని కృతి ఏది?
1) పండితారాధ్య చరిత్ర
2) బసవ పురాణం
3) అనుభవసారం
4) సోమనాథస్తవం
32. కింది వాటిలో సరికాని జత ఏది?
) నగ్న సత్యాలు శతకం – రావికంటి రామయ్య గుప్త
2) నరసింహ శతకం – కాకుత్సం శేషప్ప కవి
3) భరతసింహ శతకం – శ్రీపతి భాస్కర కవి
4) ప్రభుతనయ శతకం – కౌకుంట్ల నారాయణ రావు
33. దేవులపల్లి రామానుజరావు రాసిన ‘ఏబది సంవత్సరాల జ్ఞాపకాలు’ ఏ ప్రక్రియకు చెందిన
రచన?
1) వ్యాస ప్రక్రియ
2) పరిశోధనా గ్రంథం
3) ఆత్మకథ
4) జీవిత చరిత్ర
34. మల్లినాథ సూరి రాసిన వ్యాఖ్యానాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) కిరాతార్జునీయం-ఘంటాపథం వ్యాఖ్య
2) శిశుపాల వధ – సర్వంకుశ వ్యాఖ్య
3) నైషధం – జీవాతువు వ్యాఖ్య
4) పైవన్నీ సరైనవే .
35. ‘శోభ’ అనే మాసపత్రిక ద్వారా సాహిత్య సేవ చేసిన వారెవరు?
1) దేవులపల్లి రామానుజరావు
2) ఆచార్య. ఎన్. గోపి
3) కపిలవాయి లింగమూర్తి
4) మాదిరెడ్డి సులోచన